గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (12:41 IST)

బాలీవుడ్ ప్రేమ పక్షులకు ఎడబాటు.. సెట్స్‌లో బంద్!

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణబీర్ కపూర్, కత్రినా కైప్‌లకు ఎడబాటు తప్పేలా లేదు. రణబీర్, కత్రినా కైఫ్‌ల మధ్య ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తరచూ షూటింగ్ సెట్స్‌లో కలుసుకుంటూ ఉంటారు. అయితే, ఇకనుంచీ అవన్నీ బంద్ కాబోతున్నాయి. 
 
కత్రినా ప్రస్తుతం 'ఫితూర్' అనే సినిమా చేస్తోంది. షూటింగ్ కాశ్మీర్లో జరగనుంది. పక్కా ప్రణాళికతో దర్శకుడు అభిషేక్ కపూర్ షెడ్యూల్ సిద్ధం చేశాడట. షూటింగులో ఎలాంటి జాప్యం లేకుండా జరగాలని కోరుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో కాశ్మీర్ వచ్చి సెట్స్‌లో కేట్‌ను కలవొద్దని రణబీర్‌కు గట్టిగా చెప్పాడట. ఎలాంటి ఏకాగ్రతా తప్పకుండా, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలా షరతులు పెట్టాడట. పాపం రణబీర్, కత్రినాలు పైకి సరే అన్నప్పటికీ మనసులో మాత్రం తెగ బాధపడిపోతున్నారట.