'గోవిందుడు...' సిద్ధమవుతోంది!
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలె'. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. సోమవారం నాటికి షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే పోస్ట్ప్రొడక్షన్స్ పనులు సాగిపోతున్నాయి. ఈ చిత్రం కుటుంబ కథాచిత్రమనీ, అందరూ కూర్చుని చూడవచ్చని బండ్ల గణేష్ చెబుతున్నాడు.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. కృష్ణవంశీ కెరీర్లో నిలిచిపోయే చిత్రంగా వుంటుందని చెబుతున్నాడు. ఇందులో ప్రకాష్రాజ్, జయసుధ కాంబినేషన్ కూడా వుంది.