శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (14:05 IST)

పవన్ ఇంటి ముందు కూర్చుని న్యాయ పోరాటం చేస్తా.. హేమ..!

సినీ నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చొని న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. పవన్‌నే న్యాయం అడుగుతానని అన్నారు.

అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకి ఉందని అనుకోవటం లేదని హేమ కామెంట్ చేశారు. తనపై వ్యక్తిగతంగా దూషణలు చేసినందుకే శివాజీ రాజాపై ఫైర్ అవ్వాల్సి వచ్చిందని హేమ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా శివాజీ రాజా నటుడు రాజేంద్రప్రసాద్‌కి మద్దతు ఇస్తున్నారు. శివాజీరాజా తనను దూషించాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి శనివారం వెళ్లిన సంగతి నిజమేనని హేమ వెల్లడించారు.