రభస ఫట్: ఎన్టీఆర్ను పూరీ పక్కన పెట్టేశారా..!
'రభస' చిత్రం తర్వాత ఎన్టీఆర్.. నాగార్జున కాంబినేషన్లో ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేశారు. ఈ విషయంలో నాగార్జునకూడా కథ బాగా నచ్చింది. ఇద్దరు చేయడంతో పెద్ద మల్టీస్టారర్ అవుతుందని చెప్పారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎన్టిఆర్ ఆ పాత్ర చేయడంలేదని తెలుస్తోంది.
ఆ పాత్ర ప్లేస్లో సూర్య సోదరుడు కార్తీని ఎంచుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే ఎన్టిఆర్, పూరీ సినిమా ప్రారంభమైంది. అక్కడ దర్శకుడితో చిన్నపాటి మనస్పర్దలు వచ్చినట్లు తెలిసింది.
పైగా అనుకున్నంతగా రభస హిట్ కాకపోవడం కూడా తర్వాత సినిమాపై ప్రభావం పడుతుందని కథనాలు విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.