టెంపర్ ఆడియో సెక్యూరిటీ టైట్... 5.30కి వచ్చేయండి...!
ఎన్టిఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'టెంపర్'. ఈ చిత్రం ముందుగా అనుకున్నట్లు రథసప్తమి నాడు దేవాలయంలో ఆడియోను సీడీని విడుదల చేశారు. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తెలియజేస్తున్నారు. ఈ నెల 28న అంటే బుధవారంనాడు అభిమానుల సమక్షంలో గ్రాండ్గా ఆడియో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతంలో ఎన్టిఆర్ అభిమానులు తోపులాటలో దుర్ఘటనలు జరిగిన దృష్ట్యా ఈసారి సెక్యూరిటీని గట్టిగా ఏర్పాటు చేశారు.
పాస్ల్లో ఒరిజినల్ పాస్లను మాత్రమే కొన్ని గుర్తింపులున్నవి జారీ చేశారు. డూప్లికేట్ పాస్లను ఇట్టే పసికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకల్లా అభిమానులు వేదికకు వచ్చేయాలని నిర్మాత పిలుపునిచ్చారు. కాగా, ఎన్టిఆర్ ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చేస్తున్నాడు.