బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 24 డిశెంబరు 2014 (13:36 IST)

కమల్ కు దక్కని గురువు 'కడచూపు'

కె. బాలచందర్ ను కడసారి దర్శించుకునే అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ కోల్పోయారు. అమెరికా నుంచి ఆయన బుధవారం రాత్రికి చెన్నై చేరుకునే అవకాశముంది. 
 
అయితే బాలచందర్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రమే ముగిసిపోనున్నాయి. తన తాజా చిత్రం 'ఉత్తమ్ విలన్' పోస్టు ప్రొడక్షన్ పనుల కోసం కమలహాసన్... లాస్ ఏంజెలెస్‌కు వెళ్లారు.
 
బాలచందర్ మరణవార్త తెలియగానే ఈ తెల్లవారుజామున కాలిఫోర్నియా నుంచి ఆయన బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నై చేరుకుంటారని కమలహాసన్ మేనేజర్ తెలిపారు. బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారని చెప్పారు. బాలచందర్‌తో కలిసి 40పైగా సినిమాలకు కమలహాసన్ పనిచేశారు.