మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 24 డిశెంబరు 2014 (15:26 IST)

కదిలిన అంతిమ యాత్ర...! చివరి చూపుకు నోచుకోని కమల్..!

ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ అంతిమ యాత్రం ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. అయితే ఆయన్ని చివరి సారిగా చూసుకునే అదృష్టాన్ని నటుడు కమల్ హాసన్ కోల్పోయారు. అమెరికా నుంచి ఆయన బుధవారం రాత్రికి చెన్నై చేరుకునే అవకాశముంది. 
 
తన తాజా చిత్రం 'ఉత్తమ్ విలన్' పోస్టు ప్రొడక్షన్ పనుల కోసం కమలహాసన్... లాస్ ఏంజెలెస్‌కు వెళ్లారు. బాలచందర్ మరణవార్త తెలియగానే ఈ తెల్లవారుజామున కాలిఫోర్నియా నుంచి ఆయన బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నై చేరుకుంటారని కమలహాసన్ మేనేజర్ తెలిపారు. బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారని చెప్పారు. 
 
అయితే బాలచందర్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రమే ముగిసిపోనున్నాయి. ఆల్వార్ పేటలోని ఆయన నివాసం నుంచి బాలచందర్ బౌతికకాయాన్ని ఊరేగింపుగా శ్మశాన వాటికకు బయలుదేరింది.