బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:21 IST)

మాలాశ్రీపై యాసిడ్ దాడి బెదిరింపులు.. ఉద్యోగి కోసం గాలింపు..!

ఆ మధ్య టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలిగిన అందాల తార మాలశ్రీ. ఆ తర్వాత కన్నడ చిత్రాల్లో నటిస్తు సెటిల్ అయ్యింది. తనపై యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని మాలాశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో తన వద్ద పని చేసిన ఉద్యోగి తనను బెదిరిస్తున్నట్టు తెలిపింది. ఆమె బెంగుళూరులో భర్త రాముతో కలిసి ఉంటుంది. ఆమెకు చెన్నైలో ఒక మాల్, అపార్ట్ మెంట్‌లు ఉన్నాయి.
 
వాటి నిర్వహణ బాధ్యతలు అంతా మాలశ్రీనే చూసుకుంటుంది. ఈ స్థితిలో అపార్ట్ మెంట్‌ను విక్రయించేందుకు సిద్ధంకాగా, అందులో పని చేస్తున్న ఒక ఉద్యోగి తనను బెదిరిస్తున్నట్టు తెలిపింది. అపార్ట్‌మెంట్ అమ్మితే వచ్చే డబ్బులో తనకు వాటా ఇవ్వాలని, లేదంటే యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరిస్తున్నట్టు తెలిపింది. అతని వెంట మరో ఇద్దరు కూడా ఉన్నారని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.