శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (16:44 IST)

టుస్సాడ్స్ మ్యూజియంలో కత్రినా మైనపు బొమ్మ..!

లండన్లోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ మైనపు బొమ్మ ఏర్పాటైంది. ఇటీవల టుస్సాడ్ వెబ్సైట్, పంజాబ్ రేడియో సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ పోటీలో  ప్రియాంకా చోప్రా, దీపికా పడుకోనేను వెనక్కి నెట్టి కత్రినా ఈ గౌరవాన్ని దక్కించుకుంది. 
 
తద్వారా మైనపు బొమ్మల ప్రదర్శనశాలలో స్థానాన్ని దక్కించుకున్న ఏడో బాలీవుడ్ నటిగా కత్రినా ఖ్యాతి దక్కించుకుంది. ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్,  ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురీ దీక్షిత్ బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి.