టాలీవుడ్కు మరో మల్లూ బ్యూటీ.. రామ్ సరసన కీర్తి..!
దక్షిణాది చిత్ర సీమలో మలయాళీ బ్యూటీలదేపైచేయి. పలువురు మల్లూ ముద్దుగుమ్మలు తెలుగు తెరపై హల్చల్ చేశారు. తాజాగా మరో మలయాళీ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. లేత సోయగాల సుందరి కీర్తి సురేష్ తొలిసారిగా తెలుగు సినిమా చేస్తోంది. పైగా, యంగ్ హీరో రామ్ పక్కన కథానాయికగా నటించనుంది.
నూతన దర్శకుడు రమేష్ తుమ్మల దర్శకత్వంలో రామ్ హీరోగా నటించే 'హరికథ' చిత్రంలో ఈ సుందరి హీరోయిన్గా ఎంపికైంది. మార్చి 31న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలవుతుంది. అన్నట్టు, కీర్తి ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలలో నటిస్తోంది.