శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (14:49 IST)

కీసరకు జయప్రద.. ఎందుకు? ఎప్పుడు..?

అలనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రద రంగారెడ్డి జిల్లా కీసరకు వెళ్లారు. ఆమె అక్కడ చౌర్యాల గ్రామంలో ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. బుధవారం రాత్రి అక్కడికి వెళ్లిన జయప్రద స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కోరిక నెరవేరినందుకు మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో ఆలయ ఛైర్మన్ లక్ష్మీనారాయణ ఆమెకి స్వాగతం పలికారు. పూజల అనంతరం చైర్మెన్ ఆమెకు స్వామివారి జ్ఞాపికను అందచేసి సత్కరించారు. అయితే ఇంతకీ ఆమెకు తీరిన కోరిక ఏమిటో మాత్రం జయప్రద వెల్లడించలేదు.