గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (19:36 IST)

దక్షిణాది.. ఉత్తరాది రెండూ ముఖ్యమే..!: కృతిసనన్

టాలీవుడ్, బాలీవుడ్ తనకు రెండూ ముఖ్యమేనని మహేష్ హీరోయిన్, వన్ భామ కృతిసనన్ చెప్పింది. ఉత్తరాది, దక్షిణాది సినిమాలను సమన్వయం చేసుకుని కెరీర్‌ను కొనసాగిస్తానని ఆమె తెలిపింది. 'హీరోపంటీ' సినిమాతో జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ సరసన బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన కృతి, 'వన్' సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు సరసన అరంగేట్రం చేసింది. 
 
'హీరోపంటీ' సినిమా బాలీవుడ్‌లో మంచి వసూళ్లు సాధించగా, తెలుగునాట 'వన్' డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్‌లో ప్రతిభ ఉన్న నటులు చాలామంది ఉన్నారని చెప్పింది. రెండు పరిశ్రమల్లో పనిచేస్తూ తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నానని కృతిసనన్ విశ్వాసం వ్యక్తం చేసింది.
 
ఇదిలా ఉంటే కృతిసనన్‌కు ఈ మధ్య బాలీవుడ్ ఆఫర్లు మెండుగా వస్తున్నాయని సినీ జనం చెప్తున్నారు. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో అమీర్‌ఖాన్ స‌ర‌స‌న కృతిస‌న‌న్ న‌టించాల్సి ఉండ‌గా, చివ‌రి నిముషంలో కృతిస‌న‌న్‌కు ఆఫ‌ర్ వ‌రించ‌లేదు. కాని కృతిస‌నన్‌తో కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌తో స‌రిపెట్టకుండా, త‌న‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ఆమీర్‌ఖాన్ ఆలోచిస్తున్నాడు. దీంతో అమీర్ స‌ర‌స‌న కృతిస‌న‌న్ హీరోయిన్‌గా చేస్తుంద‌ని అప్పుడే బాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.
 
మహేశ్ బాబు 1 సినిమాను రీమేక్ చేయడానికి అమీర్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే హిందీలో కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. మరోవైపు వరుణ్ ధావన్‌తో కృతిసనన్ నటించబోతోంది.