శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 19 జులై 2014 (22:55 IST)

అల్లు అర్జున్ అభిమానులపై లాఠీ ఛార్జ్... అలిగిన బన్నీ

టాలీవుడ్ కండలవీరుడు అల్లు అర్జున్ అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. తిరుపతిలొ ఓ నగల షాప్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. అల్లు అర్జున్ నగల దుకాణానికి వస్తున్నారని తెలుసుకున్నంతనే అక్కడికి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాంతో అల్లు అర్జున్‌తో కరచాలనం తీసుకునేందుకు అభిమానులు, జనం ఎగబడ్డారు. జనం మధ్యలో ఇరుక్కుపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో అక్కడి నుంచి ఊపిరి ఆడని పరిస్థితిలో బయటపడ్డారు.
 
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సెల్‌ఫోన్‌ షోరూమ్‌ ఓపెన్‌ చేస్తే గత ఏడాది అక్కడ ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం పోలీసులకు జేజేమ్మ కనబడింది. అయితే ఇదే పరిస్థితి తిరుపతిలో జరిగింది. ఓ నగల దుకాణం ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన్ను చూడ్డానికి అభిమానులు తెగ వచ్చేశారు. 
 
ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు దిగేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో అక్కడ కంట్రోల్‌ తప్పింది. పోలీసులు గతి లేక లాఠీలకు పనిచేప్పే పరిస్థితి వచ్చింది. దాంతో అల్లు అర్జున్‌ హడావుడిగా వెళ్ళిపోయారు. అయితే.. అక్కడ జనాల్ని కొట్టడం అల్లు అర్జున్‌కు కోపం తెప్పించింది. పోలీసులు తగినంతగా లేకుండా ఉండటంతోనే అదుపు తప్పిందని... వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో నిర్వాహకులు సర్ది చెప్పి పంపించేశారు.