గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (15:44 IST)

మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ .. చంద్రబాబునూ కలిశారు!

మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడు, నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. మొన్నటికిమొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఆయన.. గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రుడు, కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలసినట్టు చెప్పారు. కేసీఆర్‌ను, చంద్రబాబును కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. ఇద్దరు సీఎంలు తనకు మంచి స్నేహితులని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపై త్వరలోనే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశం నిర్వహిస్తానన్నారు.