పూరీ ''టెంపర్"లో బంపర్ ఆఫర్: ఎన్టీఆర్కు సిస్టర్గా మధురిమ!
పూరీ జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ''టెంపర్'' మూవీలో మధురిమకు బంపర్ ఆఫర్ లభించింది. అజయ్ హీరోగా నటించిన 'ఆ ఒక్కడు'తో హీరోయిన్గా మధురిమ తెలుగులో తెరంగేట్రం చేసిన మధురిమ.. ఆ తర్వాత 'సరదాగా కాసేపు', 'షాడో' లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ గుర్తింపు రాలేదు. ఇటీవలే, అల్లు శిరీష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'కొత్త జంట'లో ఓ స్పెషల్ సాంగ్ చేసి సందడి చేసింది.
తాజాగా మధురిమకు ఓ బంపర్ ఛాన్స్ దక్కింది. ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టెంపర్'లో ఆమె ఓ కీలక పాత్రకు ఎంపికయ్యింది. అయితే, ఆమెకు వచ్చింది హీరోయిన్ అవకాశం కాదు. ఎన్టీఆర్ చెల్లెలుగా ఈ చిత్రంలో ఆమె నటిస్తుందని సమాచారం.
ఈ సినిమాలో చెల్లి పాత్ర చాలా ముఖ్యం కావడంతో, రెగ్యులర్గా ఇలాంటి పాత్రలు చేసేవారిని పక్కనపెట్టి, మధురిమను తీసుకున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి.