గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:50 IST)

మహేష్ బాబు చిత్రం... ప్రభాస్ వాయిస్ ఓవర్

'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న కొత్త చిత్రంలో హీరో మహేష్‌ బాబు అని తెలిసిందే. ఈ చిత్రం సెట్‌పైకి వెళ్ళడానికి దాదాపు పని పూర్తయింది. ఈ నెల 30న పూణెలో  ప్రారంభం కానుంది. గతంలో మిర్చి సినిమాను కొరటాల ఇలాగే ప్రారంభించారు. మొదటగా వైజాగ్‌లో చిత్రించాలనుకున్నా... తుఫాను వల్ల ఆ షెడ్యూల్‌ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌ కూడా ఓ చేయి వేస్తున్నాడట. అంటే సినిమాకు వాయిస్‌ ఓవర్‌ను ఇస్తున్నాడు. దీనికోసం చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సినిమాకు 'కన్నయ్య', 'మగాడు' టైటిల్స్‌ పరిశీనలో వున్నాయి. వాడు మగాడ్రా బుజ్జి అనే టైటిల్‌ను ఇప్పటికే మహేష్ బావ సుధీర్‌ చిత్రానికి పెట్టశారు. 
 
మగాడు అంటే.. రాజశేఖర్‌ చిత్రం కూడా గుర్తుకు వస్తుంది. అదుకే కన్నయ్యకే ఎక్కువ మార్కులు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, నదియా వంటివారు నటిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌.