లక్ష్మీప్రసన్న క్రైం కామెడీ చిత్రం... విద్యా నిర్వాణ స్విచాన్...
'ఊ కొడతారా? ఉలిక్కిపడతారా?' 'గుండెల్లో గోదారి' చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి మరో సరికొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. మంచు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఫైవ్ ఎలిమెంట్స్ సంస్థతో కలిసి చిత్రాన్ని ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గురువారంనాడు హైదరాబాద్లోని ఓ భవనంలో లాంఛనంగా ప్రారంభమైంది.
దేవుడి పటాలపై చిత్రించిన ముహూర్తపు షాట్కు శ్రీనివాస్ నాయుడు క్లాప్ ఇవ్వగా, ఆమె భర్త ఆండ్రి, కుమార్తె విద్యా నిర్వాణ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్కు మంచు మనోజ్ గౌరవ దర్శకత్వం వహించారు. క్రైం కామెడీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గౌతంమీనన్ దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎన్.వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
డిసెంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి బి. శ్రీనికేత్ ఫొటోగ్రఫీ అందిస్తుండగా సత్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సంబాషణలను 'కృష్ణం వందే జగద్గురం' ఫేమ్ సాయిమాధవ్ బుర్రా రాస్తున్నారు.