మళ్లీ హీరోయిన్గా మంచు లక్ష్మీ... 'దొంగాట'కు ఖరారు..!
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మంచు లక్ష్మీ మళ్లీ ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. గత కొంత కాలంగా టీవీ కార్యక్రమాల్లో హల్చల్ చేస్తూ కనిపించిన అమ్మడు ఇప్పుడు మళ్లీ వెండితెరపై మెరవనుంది. ప్రముఖ సినీ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో లక్ష్మీ హీరోయిన్గా నటించనుంది.
ఈ చిత్రంలో హీరోయిన్గా మాత్రమే కాకుండా మంచు ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తోంది కూడా. ఈ చిత్రం గురించి లక్ష్మీ మాట్లాడుతూ.. ఈ కొత్త చిత్రానికి 'దొంగాట' టైటిల్ను ఖరారు చేసినట్టు తెలిపింది. క్రైమ్ కామెడీ చిత్రంగా దీనిని రూపొందిస్తున్నట్టు వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో అడవి శేష్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నట్టు సమాచారం.