మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 6 జులై 2014 (13:47 IST)

భూకబ్జా కేసులో మణిశర్మపై చెన్నైలో కేసు నమోదు!

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై ఓ భూకబ్జా కేసు నమోదైంది. ఈ కేసులో చెన్నై ఆలందూరు కోర్టులో నేరవిభాగపు పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. మణిశర్మకు స్థానిక నీలాంగరై సమీపంలోని కానాత్తురులో కొంత స్థలం ఉంది. ఈ స్థలానికి కంచె వేసే సమయంలో తనకు చెందిన 75 సెంట్ల భూమిని కూడా కలుపుకున్నట్లు కరుప్పన్‌ అనే వ్యక్తి మణిశర్మపై నీలాంగరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ కేసు విచారణ చేపట్టిన నేర విభాగపు పోలీసులు కంచెవేసిన స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు పాల్పడినట్లు తేలడంతో, ఆలందూర్‌ కోర్టుకు నివేదించారు. అయితే ఈ కేసుకు సంబంధించి మణిశర్మ ముందస్తు బెయిల్‌ పొంది ఉన్నారు. కాగా, నకిలీ పత్రాలతో దాదాపు 10 కోట్ల విలువ చేసే భూమిని మణిశర్మ కబ్జా చేసినట్లు ఆరోపణ. ఈ విషయమై ఇప్పటికే మణిశర్మ మేనేజర్‌ని పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ కోసం మణిశర్మను త్వరలో పిలిపిస్తారని తెలుస్తోంది.