గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 14 మే 2015 (13:36 IST)

కేన్సర్ నుంచి కోలుకున్న మనీషా... కమల్ సరసకు రెడీ..!

బాలీవుడ్ బ్యూటీలలో అతి కొద్ది మంది మాత్రమే దక్షిణా చిత్రాలలో నటించి అభిమానుల గుర్తింపు పొందుతారు. ఆ విధంగా పరిచయం అయిన నేపాలీ భామ మనీషా కొయిరాలా. సుమారు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాలో కమలహాసన్, మనీషా కొయిరాలా జతకట్టిన సంగతి మనకు తెలుసు. ఆ సినిమాలో ఇద్దరి మధ్యా వెండితెరపై అదరగొట్టే రొమాన్స్ జరిగింది. 
 
ఈ జంట ఇప్పుడు మళ్లీ కలసి నటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కమల్ తన అసోసియేట్ రాజేష్ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో ఆయన పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం కమల్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, కమల్ భార్య పాత్ర మరొకటి వుందట. ఆ పాత్ర కోసం మనీషా కొయిరాలాను సంప్రదిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. ఆమధ్య కేన్సర్ బారిన పడిన మనీషా అమెరికాలో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకుని, మళ్లీ నటించడానికి రెడీ అవుతోంది. కమల్ పిలిస్తే కాదనగలమా అంటూ వయ్యారాలు ఒలకబోస్తోంది మనీషా