శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 14 మే 2015 (13:22 IST)

దూసుకుపోతున్న మంజిమ... చైతూ... శింబుల సరసకు రెడీ..!

టాలీవుడ్, కోలీవుడ్‌లలో మలయాళీ ముద్దుగుమ్మలదే హవా. తాజాగా వెండితెరకు పరిచయమైన కేరళ బ్యూటీ మంజిమ మోహన్ తమిళ, తెలుగు భాషలల్లో దూసుకుపోతోంది. అసలు విషయానికి వస్తే.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'ఏ మాయ చేసావే ' సినిమా వచ్చింది. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లోనే ఈ సినిమాకి సీక్వెల్‌గా 'ఏ మాయ చేసావే 2'ని తీసుకురాబోతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో తెరకెక్కనుంది.
 
తమిళం‌లో ఈ చిత్రం 'అచ్చం ఎంబదు మదమైయద' సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో శింబు నటిస్తున్నారు. ఇక తెలుగులో ఈ ప్రాజెక్ట్‌ని ఇంకా మొదలు పెట్టలేదు. ఇంతకుముందు ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తుంది టాక్ వచ్చింది. అయితే, తను తమిళ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ఈ సినిమాలో నటించాలేకపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలో మంజిమ హీరోయిన్‌గా నటించేందుకు దర్శకుడు ఎంపిక చేశారు. దీంతో అమ్మడు వచ్చిరాగానే అటో చిత్రం, ఇటో చిత్రం అంటూ తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతోంది.