'ముకుంద' హీరోయిన్కు బాలీవుడ్ ఆఫర్... హృతిక్ సరసనకు సై..!
తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద సినిమాల హీరోయిన్గా చేసిన పూజా హెగ్డేకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. ఈ కన్నడ భామకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చిందట. అది కూడా ముకుంద షూటింగ్ సమయంలోనే. పూజ కన్నడ ఫ్యామిలీకి చెందినదైనా చిన్నప్పటి నుంచి ముంబైలో పుట్టి పెరిగి మోడల్గా పేరు తెచ్చుకుంది.
తొలుత తెలుగులో డబ్ అయిన తమిళ సినిమా మాస్క్ లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీని ఫిలిం మేకర్ అశుతోష్ గోవారికర్ సెలెక్ట్ చేయడం విశేషం. లగాన్, జోదాఅక్బర్ వంటి భారీ సినిమాలని నిర్మించిన అశుతోష్, డిస్నీ పార్టనర్ షిప్లో మొహంజొదారో అనే సినిమా నిర్మిస్తున్నారట. ఈ పిరియాడికల్ లవ్ స్టోరీలో హృతిక్ సరసన పూజను ఎంపిక చేసినట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమా కోసం పూజ ఐదు నెలలుగా పైగా బల్క్ డేట్స్ ఇచ్చింది. అందుకోసం ఈ అమ్మడు ఎన్టీఆర్, సుకుమార్ సినిమా ఆఫర్ కూడా వదులుకున్నట్టు సమాచారం. ఈ ఆఫర్తో అమ్మడు బాలీవుడ్లో సెటిలవుతుందేమో చూడాలి.