ఏప్రిల్ 3న దోచేయ్ ఆడియో.. సమ్మర్ స్పెషల్గా సినిమా రిలీజ్!
యువసామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతిసనన్ హీరోయిన్గా, స్వామిరారా వంటి సూపర్హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ని నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ 'దోచేయ్' సినిమా ఆడియో ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ 'మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ చిత్రంలోని పాటలను రోజుకి ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేయబోతున్నాం. అలాగే ఏప్రిల్ 2న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నాం. ఏప్రిల్ 3న లహరి మ్యూజిక్ ద్వారా ఆడియోను రిలీజ్ చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 17న సమ్మర్ స్పెషల్గా ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా విడుదల చేస్తున్నాం. నాగచైతన్య కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా 'దోచేయ్' నిలుస్తుంది. అలాగే మా బేనర్కి మరో సూపర్హిట్ సినిమా అవుతుంది." అని చెప్పారు.
నాగచైతన్య సరసన కృతిసనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని మురళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.