నాగచైతన్య పుట్టినరోజునాడు...
''ప్రతి మోసం వెనుక ఇద్దరు వుంటారు. ఒకడు మోసం చేసేవాడు, మరొకడు మోసపోయేవాడు. నువ్వు రెండోవాడివి కాకుండా వుండాలంటే మొదటి వాడివై తీరాలి'' అంటూ దర్శకుడు సుధీర్వర్మ చెబుతున్నారు. స్వామిరారా చిత్రం తర్వాత నాగచైతన్య హీరోగా సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రాన్ని చూశాక తనకు ఈ సినిమాకు అవకాశమిచ్చారని దర్శకుడు పేర్కొంటున్నారు. నాగచైతన్య పుట్టినరోజైన ఆదివారంనాడు టీజర్ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు తెలియజేస్తున్నారు.
'నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 'అత్తారింటికి దారేది' తర్వాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది. రిలయన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ...'''అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్లో స్వామిరారా టెక్నీషియన్స్తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ను విడుదల చేస్తున్నాం.
స్టైలిష్గా వుండే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నాగచైతన్య ఎంటర్టైన్మెంట్ కూడా ఎంజాయ్ చేస్తూ ఎంతో ఈజ్ చేస్తున్నాడు. నాగచైతన్య కెరీర్లో ఓ బెస్ట్ మూవీ అవుతుంది. పాటలు తప్ప టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. పీటర్ హెయిన్స్ సారధ్యంలో ఒక థ్రిల్లింగ్ ఛేజ్ జరుగుతోంది'' అన్నారు.