శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (15:13 IST)

దాసరి కొడుకు తారకప్రభుపై నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్!

దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు తారకప్రభుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. భరణం చెల్లించడం లేదని తారక ప్రభు భార్య సుశీల కోర్టును ఆశ్రయించడంతో ఈ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు తారక ప్రభు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. 
 
భరణం విషయంలో తారక ప్రభు, అతని భార్య సుశీల మధ్య చాలా కాలం కోర్టు కేసు నడుస్తోంది. గతంలో ఫ్యామిలీ కోర్టు సుశీలకు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభు రికారల్ పిటీషన్ దాఖలు చేసి భరణం రద్దయ్యేలా ఉత్తర్వులు పొందారు. అయితే సుశీల అంతటితో ఆగకుండా పైకోర్టులకు వెళ్లింది. ఇలా ఈ భరణం వివాదం గత కొంత కాలంగా సాగుతూనే ఉంది.