గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (13:58 IST)

దాసరి కోడలు ఫిర్యాదు : కుమారుడు తారక్ ప్రభుపై అరెస్ట్ వారెంట్!

కోర్టు ఆదేశానుసారం తనకు భరణం చెల్లించలేదంటూ దర్శకుడు దాసరి నారాయణ రావు కోడలి సుశీల చేసిన ఫిర్యాదుతో ఆయన కుమారుడు తారక్ ప్రభుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ ఆదేశాలను నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
తనకు, పిల్లలకు జీవనభృతి నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని సుశీల కోరడంతో న్యాయస్థానం భరణం చెల్లించాలని ఇంతకు మునుపు ఆదేశించింది. కొంత కాలం భరణం చెల్లించిన తారక్ ప్రభు తర్వాత ఇవ్వడం మానేశారు. భరణం బకాయిలను చెల్లించాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని గతంలో ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, భరణం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై సుశీల హైకోర్టుకు వెళ్లారు. రీకాల్ పిటిషన్ ఉత్తర్వులను నిలుపుదల చేసిన హైకోర్టు, తారక్ ప్రభును అరెస్టు చేయాలంటూ ఆదేశించింది.