అఖిలేష్ సినిమాకు నిర్మాతగా నితిన్!
అక్కినేని నాగార్జున మరో వారసుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యే సినిమా వివరాలను ఆ ఫ్యామిలీ సస్పెన్సుగా వుంచడంతో, దీనిపై రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడిగా వీవీ వినాయక్ ఖరారయ్యాడని తెలిసింది. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ని 'అల్లుడు శీను' సినిమా ద్వారా బాగా ఇంట్రడ్యూస్ చేశాడన్న పేరు రావడంతో వినాయక్ను ఎంచుకున్నారన్నది సమాచారం.
ఇక అసలు వార్త ఏమిటంటే, ఈ చిత్రానికి నిర్మాతగా యంగ్ హీరో నితిన్ వ్యవహరిస్తాడట. అఖిల్ని లాంచ్ చేసే ఛాన్స్ తనకు ఇమ్మని నితిన్ కోరడంతో నాగార్జున ఓకే చెప్పాడనీ, అతని సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్తో కలసి నాగ్ దీనిని నిర్మిస్తాడనీ ప్రచారం జరుగుతోంది.