శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:48 IST)

మళ్ళీ అదే జంట... 'బెంగళూర్ డేస్‌'లో శర్వానంద్ సరసన నిత్యా మీనన్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ ఫెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంట మరో సారి ఒకటవుతోంది. ఇప్పటికే 'ఏమిటో ఈ మాయ', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలలో జంటగా నటించిన శర్వానంద్, నిత్యామీనన్ మరోసారి హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. 
 
మయాళంలో సూపర్ హిట్ట్ అయిన 'బెంగళూర్ డేస్' చిత్రం తెలుగులోకి రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో శర్వానంద్, నిత్యామీనన్‌ల జంట ప్రేక్షకులకు మళ్లీ కనువిందు చేస్తారు. ఇందులో ఇద్దరు భార్యభర్తలుగా కనిపిస్తారు. 
 
మలయాళం మాతృకలో ఈ పాత్రలను నజ్రియా, ఫహాద్ ఫాజిల్ పోషించారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేం వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తమిళ వెర్షన్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది.