ఎన్టీఆర్ 'టెంపర్'... హైదరాబాద్ లోనే! నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం..
జూనియర్ ఎన్టీఆర్, కాజల్, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘టెంపర్’ ఆడియోను హైదరాబాద్లోనే విడుదల చేస్తామని చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా ఆడియో వేడుకను జూనియర్ ఎన్టీఆర్... తాత నందమూరి తారక రామారావు స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో నిర్వహిస్తున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఆ పుకార్లను బండ్ల గణేశ్ కొట్టిపారేశారు.
టెంపర్ ఆడియోను హైదరాబాద్లోనే రిలీజ్ చేసే పనిలో ఉన్నామన్నారు. డిసెంబర్ రెండోవారంలో పాటల్ని విడుదల చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ సినిమాలో యన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్లుక్ని గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే.