శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (18:23 IST)

''ఓకే బంగారం'' ఆడియో లాంఛ్.. ఏప్రిల్ 4న ముహూర్తం!

సమ్మర్ రిలీజ్‌కు రెడీగా ఉన్న ''ఓకే బంగారం'' సినిమా ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ నాలుగో తేదీన అట్టహాసంగా జరుగనుంది. ఇప్పటికే రిలీజైన మెంటల్ మదిలో అనే సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో ఆడియో సూపర్‌గా ఉంటుందని మణిరత్నం ఫ్యాన్స్ భావిస్తున్నారు. ట్రైలర్‌కే గుడ్ రెస్పాన్స్ లభించగా.. ఏప్రిల్ 4న రిలీజ్ అయ్యే ఆడియో కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ముంబైలో నివసించే ఓ యంగ్ కపుల్‌ మధ్య జరిగే రొమాంటిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తుంగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే.. తెలుగులో ఓకే బంగారంను దిల్ రాజు ఎస్వీసి ఫిలిమ్స్ పతాకంపై రిలీజ్ చేయనున్నారు.