పవర్ స్టార్ అభిమానికి రూ. కోటి...! బంపర్ ఆఫర్...!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థి పృధ్విరాజ్కు బంపర్ ఆఫర్ కొట్టింది. పృద్విరాజ్ చదువుతున్న కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించిన ఎలక్ర్టానిక్స్ దిగ్గజం ‘శామ్ సంగ్’ అతనికి ఏడాదికి రూ.1 కోటి జీతం ఆఫర్ చేస్తూ ఉద్యోగం ఇచ్చింది.
దీంతో పృద్వి విజయ వార్తను తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులే కాకుండా పవన్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యనే తన వినూత్నమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు పవన్ అభిమానులు కూడా తలచుకుంటే ఏదైనా సాధించగలరనడానికి ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.
సాధారణంగా సినిమా హీరోలను ఆరాధిస్తూ తిరిగే యువకులు ఎందుకూ పనికిరారని హితబోధలు తెలిపే వారికి పృధ్విరాజ్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు.