కులాంతర వివాహం చేసుకుని బుకింగ్ క్లర్క్గా ఎంఎస్ పని చేశాడు : పరుచూరి!
హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిన్న ఉంటాడనుకున్న వ్యక్తి నేడు లేకుండా పోవడం చాలా బాధాకరమని చెమర్చిన కళ్ళతో అన్నాడు.
ఎంఎస్ మృతిపై పరుచూరి మాట్లాడుతూ ఎంఎస్ నారాయణలోని మరో కోణం తనకు తెలుసన్నారు. అందరికీ నటుడుగా, రచయితగా తెలుసనీ, తనకు మాత్రం ఆయన విద్యార్థి అని గుర్తుతెచ్చుకున్నారు.
కళాప్రపూర్ణను ప్రేమించానని, కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని ఎంఎస్ తనవద్దకు వస్తే, పెళ్లికి పెద్దరికం వహించానని తెలిపారు. ఆ సమయంలో జీవనం గడిచేందుకు ఓ సినిమా థియేటర్ లో బుకింగ్ క్లర్క్ గా పనిచేశాడని చెప్పారు.