మెగా బ్రదర్స్ ఒకే వేదిక పైకి... పవన్ కోసం ఎగబడతారా...?
మెగా బ్రదర్స్ ఒకే వేదికపై రానున్నారు. చాలాకాలం తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు.. శనివారం రాత్రి శిల్పకళావేదికపై ఎక్కనున్నారు. వారి మేనల్లుడు సాయిధరమ్ తేజ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రం ఆడియో జరగనుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కోసం ఆడియో వేడుక కొద్దికాలంగా వాయిదా వేస్తూ వచ్చారు. పవన్కు... చాలా ఇష్టమైన మేనల్లుడు.
కొన్ని షేడ్స్.. పవన్ను సాయి ధరమ్లో పోలి వుంటాయి. కాగా, వీరు ముగ్గురు వచ్చినా.. సెంటరాఫ్ ఎట్రాక్షన్ పవన్ కళ్యాణ్ అవుతాడనే అభిమానులు అంటున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఫ్యాన్స్ పాస్ల కోసం సందడి చేస్తున్నారు.
కాగా, ఈ వేడుకలో అభిమానుల నుంచి చిరంజీవి సినిమా 150వ చిత్రాన్ని ప్రకటించమని అడిగే సూచనలు కన్పిస్తున్నాయి. అవన్నీ తర్వాత అని చెప్పే విధంగా చిరు ప్రకటించిన ఆశ్చర్యంలేదు. చాలా ఫంక్షన్లలో చిరు వున్నా... వేదికపై పవన్ గురించి ఫ్యాన్స్ స్లోగన్లు ఇచ్చి.. సందడి చేసేవారు. మరి ఈరోజు వేడుకలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే.