గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (17:28 IST)

మోడీజీ.. మీ సవాల్కు మేం సిద్ధం : ప్రియాంకా చోప్రా - అమీర్ ఖాన్ ట్వీట్స్!

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ్ భారత్ సవాల్‌కు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, నటుడు అమీర్ ఖాన్‌లు స్పందించారు. మోడీ ఇచ్చిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. గురువారం స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించిన నరేంద్ర మోడీ.. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఏడాదికి వంద గంటల పాటు పాల్గొనాలని ప్రజలకు మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు. ముఖ్యంగా దేశంలో ఉన్న సెలెబ్రిటీలలో 9 మంది పేర్లను ఆయన చదివి ప్రకటించారు. 
 
వీరిలో నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు. అయితే, మోడీ సవాల్‌కు ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో సానుకూలంగా ప్రతిస్పందించారు. ప్రధాని చేపట్టిన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ప్రధాని విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 
 
ఇది చాలా మంచి ఆలోచన అని పేర్కొన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి తమ సహాయసహకారాలు అందించాలని ఆమె తన అభిమానులను కోరారు. మరోవైపు, అమీర్ ఖాన్ ఓ అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమానికి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.