పూరీ-జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలేమీ లేవట...
అగ్ర హీరో అగ్ర దర్శకుడిమధ్య విబేధాలు వచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. వారే పూరీ జగన్నాథ్, ఎన్టిఆర్లు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా షూటింగ్ పూరీ నూతన కార్యాలయంలో ఆరంభమై వారంరోజులు సాగింది. ప్రస్తుతం 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ విషయంలో పూరీ తీసుకున్న నిర్ణయం ఎన్టిఆర్కు రుచించలేదని తెలుస్తోంది. దాంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయని తెలిసింది.
కానీ ఈ విషయంలో నిర్మాత బండ్లగణేష్ మాత్రం అటువంటిది ఏమీలేదని గట్టిగా చెబుతున్నారు. రకరకాల వార్తలు వస్తుంటాయి. అవన్నీ రూమర్సే అంటున్నారు. ఇటీవలే ఆయన 'నీ జతగా నేనుండాలని' అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావాల్సి వుంది.
కానీ ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పూరీ విషయంపై స్పందిస్తూ... కొన్నిచోట్ల రకరకాల వార్తలు రాసేస్తున్నారు. పూరీ, ఎన్టిఆర్లు బెస్ట్ ప్రెండ్స్ అని కూడా అంటున్నారు. ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివి మామూలేనని ఆయన ఆంతర్యం కాబోలు.