గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (18:14 IST)

కోటకు పద్మ అవార్డు హ్యాపీ.. ముళ్లపూడికి నో.. రాజమౌళి అన్ హ్యాపీ!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుకు చోటు దక్కడంపై పలువురు తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి కూడా కోటకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు.
 
అదే సమయంలో ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఇప్పటికీ రాక పోవడంపై రాజమౌళి తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ మేరకు ట్విట్టర్లో 
 
Kota srinivasarao gari ki padma puraskaram labinchadam santosham,
Ippatikee mullpudi venkataramana gari ki raakapovadam baadhakaram అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే.. ముళ్లపూడి వెంకట రమణతో పాటు అనేక మంది తెలుగు సినిమా ప్రముఖులకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు దక్కలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
రాజమౌళి తాజా సినిమా ‘బాహుబలి' విషయానికి కొస్తే ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ పూర్తియింది. మరో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సమ్మర్లో ‘బాహుబలి' పార్ట్ 1 విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.