గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (12:51 IST)

తెలుగు ''సైవం''లో తాతయ్యగా రాజేంద్రప్రసాద్.. ఉషాకిరణ్ మూవీస్..

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించే కొత్త సినిమాలో నటించనున్నాడు. ఆ మధ్య తమిళంలో వచ్చిన 'సైవం' చిత్రాన్ని ఈ సంస్థ రీమేక్ చేస్తోంది.

ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో నాజర్, బేబీ సారా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా పేరు తెచ్చుకుంది. 
 
దీని హక్కులను ఉషాకిరణ్ మూవీస్ తీసుకుంది. నాజర్ పోషించిన తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తాడట. ప్రముఖ దర్శకుడు క్రిష్ దీనికి దర్శకత్వం వహించవచ్చని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి