శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (17:34 IST)

హుదూద్ బాధితులకు.. రజనీ రూ.5 లక్షల విరాళం...!

హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం సూపర్ స్టార్ రజనీకాంత్ ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఆయన ఇందుకుగాను చెక్కును ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నిధికి పంపించారు. 
 
రజనీకాంత్ నిర్వహిస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్టు తరుపున ఆయన ఈ విరాళం అందజేశారు. విశాఖపై హుదూద్ విళయతాండవం చేసినప్పుడు తన మనసు చాలా బాధపడిందన్నారు. త‌న వంతు సాయంగా 5 లక్షల రూపాయిలు అందించినట్టు తెలిపారు.