''గబ్బర్ సింగ్ 2'' ఆఫర్: పవన్ సరసన నటించాలంతే.. రకుల్ ప్రీత్ సింగ్!
లక్కీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు గబ్బర్ సింగ్ 2లో సెకండ్ హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చేసింది. వరుస హిట్లతో మాంచి జోష్ మీదున్న రకుల్ ప్రీత్ సింగ్కు 'గబ్బర్ సింగ్ 2' సినిమాలో రెండో కథానాయిక పాత్ర కోసం పిలుపు వచ్చిందట. దాంతో ఆమె సెకండ్ లీడ్ అయినా సరే చేయడానికి వెంటనే ఓకే చెప్పేసిందట.
ఇప్పటికే ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ను ప్రధాన కథానాయికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 'పవర్' ఫేం బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు.
ఈ మూవీ కోసం సెకండ్ హీరోయిన్గా నటిస్తావా అని అడగడమే అదునుగా రకుల్ ఓకే చెప్పేసిందట. పవన్ సరసన నటిస్తే చాలునని, ఫస్ట్, సెకండ్ హీరోయిన్ సంగతి పక్కనపెట్టేయండని ఆఫర్ ఇచ్చిన వాళ్లతో రకుల్ అందట. ఇంకేముంది.. అదన్న మాట పవన్ కల్యాణ్ క్రేజ్ అంటే.