రకుల్ ప్రీత్ సింగ్ సల్మాన్ ఖాన్ను కలుసుకుందోచ్!
అవునండి ప్రస్తుతం హీరోయిన్స్ తమ అభిమాన నటులను కలుసుకోవడం.. వాటిని సామాజిక సైట్లలో పోస్ట్ చేసుకోవడం ఫ్యాషనైపోయింది. ఇటీవలే కాజల్ అగర్వాల్ సల్మాన్ ఖాన్ను ఫ్లైట్లో మీట్ కాగా.. ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కాజల్ను ఫాలో అయ్యింది. అయితే రకుల్ సల్మాన్ను కాకుండా షారూఖ్ను కలిసింది.
దీంతో బిజీ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. ఇంకా చెప్పాలంటే, షారూఖ్ ఖానే ఆయనే రకుల్ సెట్లోకి వచ్చాడు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో రమేష్ సిప్పీ నిర్మిస్తున్న 'సిమ్లా మిర్చి' సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబయ్లోని మెహబూబ్ స్టూడియోలో జరుగుతుండగా, ఆ పక్కనే షూటింగ్ చేస్తున్న షారుఖ్ ఆ సెట్కి వచ్చాడు.
రమేష్ సిప్పీతో షారుఖ్కి ఎంతో అనుబంధం వుంది. దాంతో ఆయనను కలవడానికి వచ్చి యూనిట్ అందరితోనూ కాసేపు ముచ్చటించాడు. అప్పుడే రకుల్ని ఆయనకు పరిచయం చేశారు. "షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు వీరాభిమానిని. అలాంటిది ఆయనను తొలిసారిగా కలవడం కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. ఆ సమయంలో షారుఖ్ మాతో ఎన్నో కబుర్లు చెప్పాడు" అంటూ మురిసిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్