అర్రే... వర్మ మళ్లీ ఏసేశాడు... మగధీర 750 కోట్లంట... ఆగడు 75 కోట్లంట...
మహేష్ బాబు తన సినిమాలో అన్నట్లు వర్మ మళ్లీ ఏసేశాడు. మరోసారి సంచలన వ్యాఖ్య చేసి మహేష్ ఆగడు సినిమాపై ట్వీట్ చేశాడు. దర్శకుడు రాంగోపాల్ వర్మ 'ఆగడు' సినిమాపై తనదైన శైలిలో ఇలా ట్వీటాడు. 'ఆగడు' - 'మగధీర' సినిమాకు పోలిక పెడుతూ 'ఆగడు' రూ.75 కోట్ల సినిమా అయితే 'మగధీర' రూ.750 కోట్ల సినిమా అని ట్వీట్ చేశారు. దీనికి కారణాన్ని కూడా వివరిస్తూ ఈ రెండు సినిమాలు ఆయా హీరోల కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రాలని తేల్చేశాడు. అందువల్లనే వాటి మధ్య పోలిక పెట్టాననీ రాశాడు. మరోవైపు ఆగడు చిత్రంపై డివైడ్ టాక్ నడుస్తోంది.
మరోవైపు మహేష్ బాబు, తమన్నా జంటగా జి.రమేష్ బాబు సమర్పణలో సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆగడు'. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి యునానిమస్గా సూపర్హిట్ టాక్తో దిగ్విజయంగా రన్ అవుతోంది. సూపర్స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు ఈ చిత్రాన్ని శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని సినీమాక్స్ థియేటర్లో ప్రత్యేకంగా వీక్షించారు.
అనంతరం మీడియాతో సూపర్స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ''ఆగడు' సినిమా అదిరింది. సినిమా చూస్తున్నంత సేపు చాలా చాలా బాగుంది. మహేష్ ఎక్స్ట్రార్డినరీగా నటించాడు. శ్రీను వైట్ల అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. థమన్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఫైట్స్, కామెడీ, ఎస్పషల్లీ డైలాగ్స్ అన్నీ ఎక్స్లెంట్గా వున్నాయి. ఇందులో ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. 14 రీల్స్ నిర్మాతలు రామ్, గోపీ, అనీల్ చాలా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్గా నిర్మించారు. 'ఆగడు' అన్ని రికార్డ్స్ని క్రాస్ చేసి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని నా నమ్మకం. మంచి సబ్జెక్ట్ కుదిరితే నేను, మహేష్ కలిసి నటిస్తాం'' అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ - ''ఆగడు టైటిల్కి తగ్గట్టుగానే సినిమా కూడా వండర్ఫుల్గా వుంది. ఒక్క సెకను కూడా బోర్ కొట్టకుండా సినిమా ఇంత త్వరగా అయిపోయిందా అనిపించింది. మహేష్ పుట్టుకతోనే మంచి ఆర్టిస్ట్. తనలో మంచి టాలెంట్ వుంది. ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించాడు. సైలెంట్గా వుంటూనే అందర్నీ నవ్విస్తాడు. 'ఆగడు' చాలా చాలా బాగుంది. అందరికీ నచ్చే సినిమా ఇది'' అన్నారు.
సూపర్స్టార్ మహేష్బాబు, తమన్నా, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, తనికెళ్ల భరణి, సోనుసూద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: ఎస్.ఎస్. థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకర, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.