మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (14:59 IST)

పబ్లిసిటీ స్టంట్: అందుకే రంభపై వరకట్నం కేసు.. సోదరుడు

రంభపై వరకట్నం వేధింపు కేసు పబ్లిసిటీ కోసమేనని రంభ సోదరుడు శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ నటి రంభపై డౌరీ కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు 498 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారంటూ పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
తన ఫిర్యాదులో భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభపై కూడా పల్లవి ఆరోపణలు చేసారు. అయితే రంభ సోదరుడు శ్రీనివాస్ మాత్రం పల్లవి ఆరోపణలను ఖండించారు. పల్లవి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశారు.
 
పల్లవి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందని కొట్టిపారేశారు. రంభ పరువు తీయాలనే పల్లవి ఇదంతా చేస్తుందని, ఆమె కుటుంబ సభ్యులే ఆమెతో ఇదంతా చేయిస్తున్నారని శ్రీనివాస్ చెప్పారు. రంభపై ఆరోపణలు చేస్తే సహించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.