గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 29 మే 2015 (20:48 IST)

15 ఏళ్ల తర్వాత 'మొగలిపువ్వు' కోసం విదేశాలకు రాంగోపాల్ వర్మ

సచిన్ జోషి కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మొగలిపువ్వు'. మీరా చోప్రా, కైనత్ అరోరా కథానాయికలు. జెడ్3 పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీత్ గంగూలీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలాండ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సీజర్ గొంజాల్వేస్ కోరియోగ్రఫీలో సచిన్ జోషి, మీరా చోప్రాలపై ఇటివలే ఓ శృంగారాత్మక గీతాన్ని తెరకెక్కించారు. వర్మ మార్క్ రొమాంటిక్ టచ్ ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణ.
 
ఓ సినిమా చిత్రీకరణ కోసం పదిహేనేళ్ళ తర్వాత వర్మ విదేశాలకు వెళ్ళడం విశేషం. గతంలో 2000 సంవత్సరంలో 'మస్త్' చిత్రంలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్ళారు. ఆ తర్వాత 'మొగలిపువ్వు' వర్మను విదేశాలకు తీసుకెళ్ళింది. వివాహిత వ్యక్తి ఓ మహిళతో పెట్టుకున్న సంబంధం ఎంత దూరం వెళ్ళింది. అక్రమ సంబంధాలు, వాటిలో సెల్‌ఫోన్ పాత్ర ఎంత ఉంది అనే పాయింట్ మీద వర్మ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. 'ప్రతి పెళ్ళైన మగాడి సెల్ ఫోనులో భార్యకు తెలియని సీక్రెట్ ఉంటుంది' అంటూ సెల్ ఫోనును విలన్ చేసేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.