శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (13:18 IST)

'రాజ తంత్రం'లో ఆకట్టుకుంటున్న రెజీనా...!

టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఎదుగుతున్న హీరోయిన్ రెజీనా. తాజాగా ఆమె తమిళంలో 'రాజతంత్రం' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మిచ్చెల్లో డి మెల్లో పాత్రలో కనిపించనుంది. ఈ హీస్ట్ చిత్రం ప్రమోషన్ ని చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ చిత్రం టీజర్..ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
 
ట్విట్టర్ ద్వారా చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లు, పోస్టర్స్ లను యూనిట్ సెలబ్రెటీల ద్వారా విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం కనిపిస్తోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన రెజీనా ఫొటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
కాగా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ సరసన...పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం చేసిన రెజీనా... అదే హీరోతో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం చేస్తోంది. మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. వాటిని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది.