టాలీవుడ్కు 'మరియన్'... రెహ్మాన్ నోట తెలుగు పాట!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ తాజాగా తెలుగులో ఓ పాట పాడారు. గతంలో తమిళ హీరో ధనుష్ నటించిన 'మరియన్' చిత్రాన్ని ఇప్పుడు అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం మాతృకకు రెహ్మాన్ సంగీతం సమకూర్చడమే కాకుండా, అందులో ఓ పాటను కూడా పాడాడు.
ఆ పాట తమిళంలో హిట్ సాంగ్ కావడంతో, ఇప్పుడు ఈ తెలుగు వెర్షన్కి కూడా ఆయన చేతే పాడించాలని చిత్ర దర్శక నిర్మాతలు తలచారు. ఈ విషయం గురించి రెహ్మాన్ను అడగగా ఆయన అందుకు ఓకే చెప్పారట. దీంతో చంద్రబోస్ రాసిన 'మనసా... పదా' అంటూ సాగే ఈ పాటను ఇటీవలే ఏఆర్ రెహ్మాన్ పాడగా రికార్డు చేశారు.