"రైస్ బకెట్ ఛాలెంజ్" సూపర్: రాజమౌళి ప్రశంసలు
స్ఫూర్తి పరంగా 'ఐస్ బకెట్ ఛాలెంజ్'కు తీసిపోని రీతిలో భారత్లో ప్రారంభమైన 'రైస్ బకెట్ ఛాలెంజ్' పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఫేస్ బుక్లో స్పందించారు. ఇదో గొప్ప ఆలోచన అని ప్రశంసించారు.
ఈ మహోన్నత కార్యక్రమానికి అందరూ వెన్నుదన్నుగా నిలవాలని రాజమౌళి పిలుపునిచ్చారు. దీనిపై రాజమౌళి సోమవారం పోస్టింగ్ పెట్టగా, 4వేల మందికిపైగా షేర్ చేసుకోవడం విశేషం.
కాగా ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో తెలుగు మహిళ మంజు లత డిఫరెంట్ ఛాలెంజ్ తీసుకున్నారు. రైస్ బకెట్ ఛాలెంజ్గా పేరు పెట్టి దేశంలోని పేద ప్రజలకు.. అన్నం పెడుతున్నారు.
ఈ ఛాలెంజ్కు హైదరాబాద్లో మంచి ఆదరణ లభించిందని ఆమె అన్నారు. తప్పకుండా ఈ సేవా కార్యక్రమంలో పలువురు పాల్గొంటారని ఆమె ఆశించారు. ఇందుకు సహకరించిన సోషల్ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.