శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:06 IST)

బాలీవుడ్‌లో భారీ ఆఫర్... ఇద్దరు పిల్లల తల్లిగా శ్రియా!

టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీ శ్రియా. గత కొంత అవకాశాలు లేక వెండితెరకు దూరమైన అమ్మడుకి 'గోపాల గోపాల' మళ్లీ గుర్తింపునిచ్చింది. తాజాగా అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. మలయాళంలో విడుదలై హిట్టు సాధించిన సినిమా 'దృశ్యం'. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరో నటించిన ఈ  సినిమాలో తెలుగులోనూ విజయం సాధించింది. 
 
ప్రస్తుతం తమిళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న దృశ్యం, హిందీలో కూడా రీమేక్ కానుంది. ఇందులో శ్రియ నటించనుంది. ఈ చిత్రంలో శ్రియ ఇద్దరు పిల్లల తల్లి వేషాన్ని పోషించనుంది. అజయ్ దేవగణ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. కథానాయిక పాత్ర అక్కడ ఎవరికి దక్కుతుందన్న విషయంపై నిన్నటి వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. 
 
చివరికి ఎంతో అనుభవం వున్న శ్రియా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదన్న ఉద్దేశంతో ఆమెను ఎంచుకున్నట్టు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. కాగా ఇందులో పోలీసాఫీసర్ పాత్రను టబు పోషిస్తోంది.