శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (13:37 IST)

ఒప్పందం ఉల్లంఘించిన శ్రుతి.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశం..!

ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్‌పై ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ కోర్టులో ఫిర్యాదు చేసింది. శ్రుతిహాసన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సినిమా చిత్రీకరణకు హాజరుకావడం లేదని, దాంతో తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ఆ సంస్థ హైదరాబాద్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేసింది.
 
అక్కినేని నాగార్జున, కార్తీల మల్టీ స్టారర్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం చేసుకున్న నటి శ్రుతి హాసన్ చివరి నిమిషంలో తప్పుకుంది. అప్పుడు తెలుగులో మహేష్ సరసన ఒక చిత్రంలోను, తమిళంలో విజయ్ సరసన మరో చిత్రంలోను నటిస్తుండడంతో డేట్స్ కుదరక పోవడంతో ఒప్పుకున్న ప్రకారం షూటింగ్‌కు హాజరు కాలేదని సమాచారం. 
 
ఈ విషయాన్ని తెలుపుతూ.. సినిమాలో నటించనని షూటింగ్‌కు ముందు రోజు శృతిహాసన్ మెయిల్ చేసింది. దీంతో బాధిత దర్శక నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో, శృతిహాసన్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మరే కొత్త సినిమాలకు సంతకం చేయొద్దని, కొత్త సినిమాలలో నటించరాదంటూ శృతిహాసన్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.