మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (12:45 IST)

రాజీకి వచ్చిన శ్రుతి.. డేట్స్ ఇవ్వడానికి రెడీ.. రాయబారాలు ఫలించేనా..!

యవ్వనంలో కుర్రకారు యమా స్పీడు మీద ఉంటారు. వారికి ఒకసారి ఎదురుబెద్ద తగిలితేనే ఏదైనా సరే తెలుస్తుందంటారు. ఇప్పుడు అటువంటిదే క్రేజీ బ్యూటీ శ్రుతి హాసన్‌కు జరిగినట్టుంది. ఒక్క షాక్ తగలడంతో అమ్మడు స్పీడు తగ్గించుకుని, రాజీకి వచ్చినట్టు టాక్. 
 
అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా పీవీపీ సంస్థ నిర్మించే చిత్రానికి హీరోయిన్‌గా శ్రుతిని తీసుకున్నారు. అయితే, చివరి నిమిషంలో డేట్స్ లేవంటూ ఈ చిన్నది సదరు సంస్థకు ఝలక్ ఇవ్వడంతో, వారు సీరియస్‌గా తీసుకుని కోర్టుకెక్కారు.
 
దీంతో కొత్త సినిమాలు అంగీకరించవద్దంటూ కోర్టు ఆమెను ఆదేశించింది. ఇలా అమ్మడు ఒక్కసారిగా వివాదంలో ఇరుక్కుంది. పైగా, నిర్మాతను ఇబ్బంది పెట్టిందంటూ ఆమెపై ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఎదుగుతున్న దశలో ఈ వ్యవహారం కెరీర్ కి మంచిది కాదని సన్నిహితులు ఆమెకు చెప్పడంతో, శ్రుతి ఇప్పుడు ఆలోచనలో పడిందట. 
 
ఎలోనో సర్దుకుని డేట్స్ ఇస్తానంటూ, తాను రాజీకి సిద్ధమంటూ శ్రుతి ప్రస్తుతం రాయబారం పంపుతోందట. అయితే, ఇప్పటికే ఈమె స్థానంలో తమన్నాను తీసుకున్నారు. మరి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూడాల్సిందే.