శివాజీ సినిమాలు బయటకు వస్తున్నాయి!
ఇంతకుముందు నటుడు శివాజీ సినిమాలు ఆరు వరకు పెండింగ్లో వున్నాయి. ఏ చిత్రమూ సరైన సక్సెస్ రాకపోవడంతో... వాయిదాలూ పడుతూ వున్నాయి. టైం బాగుండి.. 'బూచమ్మ బూచోడు'తో ఘన విజయం సొంతం చేసుకొన్న తర్వాత ఒక్కో చిత్రం బయటకు వస్తుంది. గతంలో ఆయన నటించిన సినిమాకు 'చూసినోడికి చూసినంత' పేరు పెట్టారు.
ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. 'పి.యస్.ఆర్ ఫిల్మ్ కార్పొరేషన్' పతాకంపై పి. శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అనీల్ వాటుపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శివాజి సరసన నిత్య, లెజ్లీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు, నాగబాబు, 'థర్టీ ఇయర్స్' పృధ్వి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో విడుదల పురస్కరించుకొని చిత్ర దర్శకుడు అనీల్ వాటుపల్లి మాట్లాడుతూ... 'ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించడమే లక్ష్యంగా రూపొందిన చిత్రం 'చూసినోడికి చూసినంత'. మా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావుగారు నాకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వడంతో.. నేను కథగా అనుకొన్నదాన్ని సినిమాగా తీయగలిగాను. ఈ వారంలో 'మ్యాంగో మ్యూజిక్' ద్వారా ఆడియో రిలీజ్ చేసి, నవంబర్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం ట్రైలర్స్కు చాలా మంచి స్పందన లభిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం 'విన్నోడికి.. విన్నంత' అనేంత వినసొంపుగా కుదిరింది' అన్నారు.